జాతీయ రహదారి పక్కన నిలబడి వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్న ముగ్గురు వ్యక్తులపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడులో చోటుచేసుకొంది. పోలీసులు కథనం మేరకు బల్లికురవ మండలం ఉప్మాలూరుకు చెందిన వియ్యాల వీరాంజీ (35), అద్దంకి మండలం ధర్మవరానికి చెందిన కుంభా నాగేశ్వరరావు(60)లు కొన్నేళ్లుగా దుత్తలూరు పరిసరాల గ్రా మాల్లో గొర్రెల క్రయవిక్రయాల వ్యాపారం సాగిస్తున్నారు.
ఈ తరుణంలో బుధవారం మోటార్బైక్పై తెడ్డుపాడుకి వచ్చి గ్రామానికి చెందిన పోతులూరి వెంకటేశ్వర్లతో 565 జాతీయ రహదారికి సమీపంలో నిలబడి వ్యాపారం గురించి చర్చించుకుంటున్నారు.అదే సమయంలో అనంతపురం జి ల్లా హిందూపురం సబ్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న విజయవాడకు చెందిన ఫణిచంద్ర తమ కుటుంబ సభ్యులతో కలిసి కారులో హిందుపురానికి వెళుతున్నాడు. తెడ్డుపాడు సమీపానికి రాగానే ముందు వెళుతున్న వాహనాన్ని క్రాస్ చేయబోయి రోడ్డుపక్కన చర్చించుకుంటున్న వారిపైకి కారు దూసుకెళ్లింది.
ఈప్రమాదంలోవీరాంజీ,నాగేశ్వరరావులుఅక్కడికక్కడేమృతిచెందగా,వెంకటేశ్వర్లకుగాయాలయ్యాయి. విషయం తెలుసుకొన్న ఉదయగిరి సీఐ ప్రభాకర్రావు, దుత్తలూరు ఎస్ఐ జంపానికుమార్లు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కారు నడుపుతున్న ఫణిచంద్రను అదుపులోకి తీసుకొని మృతుల బంధువులకు సమాచారం తెలియచేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి :
ప్రధాని మోడీ గత ఏడాది కంటే సంపన్నులయ్యారు , అమిత్ షా నికర విలువ గత 15 నెలల్లో తగ్గింది.
ఉచిత విద్యుత్ పధకానికి నిధుల మంజూరు
నీటి ప్రవాహ పరిస్థితిని తెలంగాణ హైకోర్టు వింటుంది