గురుగ్రామ్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసీయూలో 21 ఏళ్ల రోగి పై అత్యాచారం

న్యూఢిల్లీ:  గురుగ్రామ్ సెక్టార్ 44లోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరిన 21 ఏళ్ల క్షయ రోగిని సిబ్బంది అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆమెను ఐసీయూలో చేర్పించారు. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఈ కారణంగానే ఆమెను ఐసియులో ఉంచారు.

వెంటిలేటర్ పై ఉన్న ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు మాట్లాడుతూ.. మంగళవారం నాడు ఆ మహిళ స్పృహలోకి రాగానే జరిగిన సంఘటన గురించి తన తండ్రికి చెప్పింది. బాధితురాలు తన తండ్రికి పేపర్ పై రాసి చెప్పడంతో ఆ తర్వాత తండ్రి కుటుంబంతో కలిసి పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -