ఆర్సీహెచ్‌ పోర్టల్‌కు వివరాల అనుసంధానంలో మొదటి స్థానం లో నిలిచిన ఆంధ్రప్రదేశ్

 నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) అంటే అసాంక్రమిక వ్యాధుల నియంత్రణకు జాతీయ ఆరోగ్యమిషన్‌ ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ఇందులో మన రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి వాటిని గుర్తించేందుకు ఐదు కోట్ల జనాభాకు సంబంధించి ఇంటింటి సర్వే చేయించారు.

 104 వాహనాల ద్వారా ప్రతి ఊరికీ వెళ్లి మందులు ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు మరింత మెరుగైనట్టు ఎన్‌హెచ్‌ఎం పరిశీలనలో వెల్లడైంది. హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల (వీటినే ఇప్పుడు వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ అంటున్నాం) నిర్వహణలోనూ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 10 వేలకు పైగా హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లు ఉండగా, వీటిలో 8,604 సెంటర్లకు కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం కేంద్రాలకు మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌గా బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారిని నియమించారు.ఇందులో ప్రధానంగా 12 రకాల సేవలను అందించడంలో గణనీయమైన వృద్ధి సాధించారు.

దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు పైస్థాయి ఆస్పత్రులకు వెళ్లాల్సిన భారం తప్పింది. ఆర్సీహెచ్‌ (రీప్రొడక్టివ్‌ చైల్డ్‌ హెల్త్‌) అంటే గర్భిణుల ఆరోగ్యం, ప్రసవం అయ్యాక చిన్నారులకు సంరక్షణ వంటి వాటిని ఎప్పటికప్పుడు కేంద్ర పరిధిలో పనిచేసే పోర్టల్‌కు అనుసంధానించే ప్రక్రియలో ఎక్కడో ఉన్న ఏపీ ఇప్పుడు మొదటి స్థానానికి వచ్చింది.మాతా శిశు మరణాల నియంత్రణ,  కుటుంబ నియంత్రణల్లో కేరళ, తమిళనాడులు ముందంజలో ఉన్నాయి. 

ఇది కూడా చదవండి:

5.3 తీవ్రతతో వచ్చిన భూకంపం సోలమన్ దీవులకి చెందిన కిరాకీరాను తాకింది.

దేశానికి 5 కాదు 500 బిజినెస్ హౌస్ లు కావాలి: పి.చిదంబరం

రైతులకు అండగా ఉండాలని ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ హితవు తెలిపారు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -