బెంగళూరు డ్రగ్స్ కేసులో నిందితుడితో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ కుమారుడు బినీష్ కొడియేరిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని కోర్టు ముందు హాజరుపరచగా 4 రోజుల కస్టడీకి తీసుకున్నారు.
ఈ ఉదయం ఏజెన్సీ జోనల్ కార్యాలయంలో బినీష్ ను మూడు గంటలపాటు విచారించారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని కోర్టుకు తీసుకెళ్లారు. బినీష్ ను నాలుగు రోజుల కస్టడీకి కోరనున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తెలిపాయి.