ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన వరలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం

విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకాన్ని తీవ్రంగా పరిగణించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ల నుంచి వివరాలను తెలుసుకున్న సీఎం బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మృతురాలు వరలక్ష్మి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని, ఆ కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్‌ను ఆదేశించారు.ప్రతి టీనేజ్‌ బాలిక మొదలు మహిళలందరూ దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించుకునేలా ఎడ్యుకేట్‌ చేయాలని సూచించారు.

పాఠశాల, కాలేజీ విద్యార్థినులు వందశాతం ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై జరిగే నేరాలను అదుపుచేయడానికి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఫలానా వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి ముప్పు ఉందని మహిళలు సమాచారం ఇస్తే ఏ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించకుండా సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి :

కరోనాతో పాటు, డెంగ్యూ పెరుగుతున్న ప్రమాదం

బైక్ దొంగల ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు రూ.12 ఎల్ విలువ చేసే బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

రూ.2 కోట్ల విలువైన డిసిఎస్ ను విక్రయించిన సైబర్ సెల్ మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది.

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -