పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఇండోర్ లోని తత్పట్టి బఖల్ ప్రాంతంలో హెల్త్ కేర్ కార్మికుల బృందంపై రాళ్లు రువ్వి నందుకు గాను ఆదివారం మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద నలుగురిని అరెస్టు చేశారు.
తాట్పట్టి బఖల్ ప్రాంతంలో రాళ్ల దాడి ఘటనలో పాల్గొన్న రజిక్, మహ్మద్ ఫిరోజ్ అనే మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఛత్రిపుర పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి పవన్ సింఘాల్ తెలిపారు. కోవిడ్-19 లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తుల నమూనాలను సేకరించడానికి నియమించిన హెల్త్ కేర్ కార్మికుల బృందం 2020 ఏప్రిల్ 1న ఆ ప్రాంతానికి చేరుకుంది.