మైనర్ బాలికపై అత్యాచారం, అపహరణ కు పాల్పడిన ఇద్దరికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ ఆర్తి శుక్లా తీర్పు వెలువరించారు.
మహిళలపై నేరాలు సమాజ నిర్మాణానికి విఘాతం కలిగిస్తోం దని కోర్టు తీర్పులో వ్యాఖ్యానించింది. మైనర్ బాలికను అపహరించి, అత్యాచారం చేసిన కేసులో బాద్నావర్ నివాసి గోపాల్ (19), జవార్ సింగ్ (25)కు కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది.