అనుమానస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన సోమవారం స్థానిక స్కిట్ కాలేజీ సమీపంలో జనచైతన్య లేఔట్లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం కోగిలి వడ్డికండ్రిగకు చెందిన వెంకటస్వామి, చెంగమ్మ దంపతుల కుమార్తె వరలక్ష్మి(28)ని అదే జిల్లాలోని సూళ్లూరుపేట మండలానికి చెందిన దశయ్యతో వివాహం చేశారు. వీరికి 12 ఏళ్ల కుమార్తె, 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఇటీవల వరలక్ష్మి భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది.
ఆమె తన స్వగ్రామంలోని పరశురాంతో పరిచయం పెంచుకుంది. 4 నెలల క్రితం వరలక్ష్మి కోగిల వడ్డికండ్రిగ నుంచి తొట్టంబేడు మండలం చిలకావారికండ్రిగలోని తన బంధువుల ఇంట చేరింది.అప్పటి నుంచి ఆమె చేపల విక్రయంతో జీవనం సాగిస్తూ వచ్చింది. పరశురామ్ కూడా ఇదే వృత్తిపై ఆధారపడ్డాడు. వీరిద్దరి పరిచయాన్ని గమనించిన తల్లిదండ్రులు వరలక్ష్మికి కోడివాకకు చెందిన వెంకటేష్తో రెండవ వివాహం చేశారు.