ప్రేమికుల దినోత్సవానికి విడుదల కానున్న రాధే శ్యామ్ టీజర్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకుడు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. శనివారంతో 30 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేశారట చిత్రబృందం. దీంతో షూటింగ్‌ క్లైమాక్స్‌కి వచ్చేసింది. ఇంకొక్క షెడ్యూల్‌ చిత్రీకరణతో ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ మొత్తం పూర్తి కానుందని తెలిసింది. అలానే ఈ సినిమా క్లైమాక్స్‌ ఓ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. సుమారు 15 నిమిషాల పాటు సాగే ఈ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయట. ఇటీవలే ‘రాధేశ్యామ్‌’ చిత్రబృందానికి చేతి గడియారాలను బహుమతిగా అందించారు ప్రభాస్‌. 

ప్రభాస్‌ నటిస్తున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం టీజర్‌ను వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని టాక్‌. టీజర్‌తోనే సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించాలనుకుంటున్నారని తెలిసింది. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది.

ఇది కూడా చదవండి :

గ్వాంటనామో ఖైదీలకు వైరస్ వ్యాక్సిన్ ఇవ్వడానికి యుఎస్ పాజ్ ప్లాన్ చేసింది

రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తే పోలవరం పనులకు ఇబ్బంది ఉండదని నివేదన వెల్లడించింది

వై ఎస్ జగన్ గాంధీ ఆశయాలను ఆచరణలో పెట్టి.. గాంధీ తత్వాన్ని ఆచరించి చూపించారు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -