ప్యాసింజర్ ట్రైన్ ఆపరేషన్స్ ప్రాజెక్ట్ లో పిపిపి కొరకు రైల్వేలు ఆర్‌ఎఫ్ఓ మదింపును పూర్తి చేసింది

భారతీయ రైల్వేలు ప్యాసింజర్ ట్రైన్ ఆపరేషన్స్ ప్రాజెక్ట్ లో పిపిపి కొరకు ఆర్‌ఎఫ్ఓ మదింపులను పూర్తి చేసింది. 120 దరఖాస్తుల్లో 102 దరఖాస్తులు ఆర్ ఎఫ్ పీ దశలో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు గుర్తించారు. 151 ఆధునిక రైళ్లు ప్రవేశపెట్టడం ద్వారా 150 కు పైగా రూట్ల కొరకు 12 క్లస్టర్లకు పైగా ప్యాసింజర్ రైలు సర్వీసుల యొక్క నిర్వహణలో ప్రైవేట్ భాగస్వామ్యం కొరకు రైల్వే మంత్రిత్వశాఖ (ఏంఓఆర్) రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్స్ (ఆర్‌ఎఫ్ఓ)ని ఆహ్వానించింది.

భారతీయ రైల్వే నెట్ వర్క్ పై ప్యాసింజర్ రైళ్లను నడపడానికి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ఇదే మొదటి ప్రధాన కార్యక్రమం. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రైవేటు రంగానికి సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ ని చేపట్టడం కొరకు ప్రయివేట్ ఎంటిటీలు, రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (ఆర్‌ఎఫ్ఓ) మరియు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పి) తో కూడిన పారదర్శక మైన రెండు దశల పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంచుకోబడతాయి. ఆర్ ఎఫ్ పీ డాక్యుమెంట్ లను అర్హులైన అభ్యర్థులకు త్వరలో అందుబాటులోకి రానుంది.

క్లస్టర్ 1 (ముంబై 1) 08 మంది దరఖాస్తుదారులు అర్హత, క్లస్టర్-2 (ముంబై-2) 11 మంది దరఖాస్తుదారులు - క్లస్టర్ 3 (ఢిల్లీ 1) 09 మంది దరఖాస్తుదారులు, క్లస్టర్ 4 (ఢిల్లీ 2) 10 మంది దరఖాస్తుదారులు, క్లస్టర్ 5 (చండీగఢ్) 08 మంది దరఖాస్తుదారులు, క్లస్టర్ 6 ( హౌరా) 08 దరఖాస్తుదారులు, క్లస్టర్ 7 ( పాట్నా) 08 దరఖాస్తుదారులు, క్లస్టర్ 8 (ప్రయాగ్ రాజ్) 09 మంది దరఖాస్తుదారులు, క్లస్టర్ 9 (సికింద్రాబాద్) 09 మంది దరఖాస్తుదారులు, క్లస్టర్ 10 (జైపూర్) 9 మంది దరఖాస్తుదారులు, క్లస్టర్ 11 (చెన్నై) 05 మంది దరఖాస్తుదారులు, క్లస్టర్ 12 (బెంగళూరు) 08 మంది అభ్యర్థులు ప్యాసింజర్ ట్రైన్ ప్రాజెక్ట్ లో పిపిపి యొక్క ఆర్‌ఎఫ్‌పి దశలో పాల్గొనేందుకు అర్హత కలిగి ఉన్నారు.

నవంబర్ 20న రూపే ఫేజ్-2ను ప్రారంభించనున్న భారత్, భూటాన్ ప్రధానమంత్రులు

రిలయన్స్ తో ఫ్యూచర్ డీల్ ను వాయిదా వేసిన అమెజాన్ బిగ్ బజార్ యజమానిని చిక్కుల్లో పడేసింది .

వోడాఫోన్ ఐడియా షేర్లు పెరిగాయి వోక్ట్రీ క్యాపిటల్ నుంచి టెల్కోకు యుఎస్‌డి 2 బి‌ఎన్ ఫండింగ్

 

 

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -