న్యూజిలాండ్ యొక్క క్రైస్ట్ చర్చ్ దాడుల వార్షికోత్సవం సందర్భంగా మార్చిలో వుడ్ ల్యాండ్స్ ప్రాంతంలోని రెండు మసీదుల వద్ద ముస్లింలపై దాడి చేయడానికి ఒక మాచెట్ ను ఉపయోగించాలని ప్రణాళిక సిద్ధం చేసిన తరువాత సింగపూర్ అంతర్గత భద్రతా చట్టం (ఐ ఎస్ ఎ ) కింద ఒక పదహారేళ్ళ సింగపూరు బాలుడిని నిర్బంధించారు.
ఆ టీనేజర్ (పేరు వెల్లడించలేదు) భారతీయ జాతికి చెందిన ప్రొటెస్టంట్ క్రిస్టియన్. ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు ఐఎస్ ఏ కింద వ్యవహరించిన అతి పిన్న వయస్కుడు ఆయనే నని అంతర్గత భద్రతా విభాగం (ఐఎస్ డీ) బుధవారం(జనవరి 27) విడుదల చేసిన మీడియా ప్రకటనలో తెలిపింది.