మృతదేహాన్ని ఇంటి ముందే వదిలి వెళ్లిపోయిన వైనం,అధికారుల ఆదేశాలతో అంత్యక్రియలు

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి రుణం తీర్చుకునేందుకు నిరాకరించాడు ఓ కన్నకొడుకు. చేసేది క్షమించరాని తప్పిదమని తెలిసినా ఆమె తనకు అన్యాయం చేసిందనే అక్కసుతో ఆమె మృతదేహాన్ని నిర్ధాక్షిణ్యంగా ఇంటి ముందు వదిలి వెళ్లిపోయాడు. పైగా తన తల్లిని తోబుట్టువు చంపేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తతంగమంతా గతంలోనే తెలిసి ఉన్న పోలీసు అధికారులు అతని దుర్మార్గపు చర్యను మందలించి తల్లి మృతదేహానికి అంత్యక్రియలు జరిగేలా చేశారు. ఈ ఘటన జిల్లాకేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం ఈడేపల్లిలో నివాసం ఉంటున్న నాగప్రసాద్‌ జిల్లా ఏఆర్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తల్లి రాజారత్నంకు నాగప్రసాద్‌తో పాటు కుమార్తె ఉంది. కొంతకాలంగా నాగప్రసాద్‌కు తోబుట్టువుకు మధ్య ఆస్తి వివాదాలు నెలకొన్నాయి. ఈ విషయంలో తోబుట్టువుతో పాటు తల్లితోనూ విభేధాలు ఏర్పడ్డాయి. నాగప్రసాద్‌ రాజారత్నంను పట్టించుకోవటం మానేశాడు. ఈ విషయంపై రాజారత్నం అనేక మార్లు నాగప్రసాద్‌పై జిల్లా కలెక్టర్‌తోపాటు అప్పటి జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు చేసింది. అయినా ప్రయోజనం లేకపోవటంతో బంటుమిల్లిలో నివాసం ఉంటున్న ఆమె కుమార్తె వద్దకు వెళ్లి తలదాచుకుంది. అప్పటి నుంచి కూతురు వద్దనే ఉంటున్న రాజారత్నం ఇటీవల అనారోగ్యానికి గురై మంగళవారం రాత్రి చనిపోయింది. దీంతో నాగప్రసాద్‌ తోబుట్టువు ఆమె భర్త కలిసి రాజారత్నం మృతదేహాన్ని ఈడేపల్లిలోని నాగప్రసాద్‌ ఇంటికి తీసుకు వచ్చారు. నాగప్రసాద్‌ మృతదేహాన్ని తన ఇంటి ముందు పెట్ట వద్దంటూ వారితో వివాదానికి దిగాడు.

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -