స్వరూపానందేంద్ర సూచనలు ముఖ్యమంత్రికి నివేదించా: స్వాత్మానందేంద్ర

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఆయన క్యాంపు కార్యాలయంలో శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగళవారం కలిశారు. అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడుతూ, దేవాలయాల భద్రతపై సీఎంతో మాట్లాడానని తెలిపారు. స్వరూపానంద స్వామి ఇచ్చిన సూచనలను ముఖ్యమంత్రికి నివేదించానని పేర్కొన్నారు.

‘‘తాను చెప్పిన అంశాలపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు. దాడులపై దర్యాప్తు వేగవంతం చేస్తామని సీఎం చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో విజయవాడలో కూల్చిన దేవాలయాలను పునర్నిర్మిస్తామని ఈ నెల 8న శంకుస్థాపన చేస్తున్నట్టుగా సీఎం తెలిపారు. ఇప్పటికే 30 వేల ఆలయాల్లో సీసీ కెమెరాలు పెట్టినట్టు చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడటంలో ప్రభుత్వం ముందుంటుందని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారని’’స్వాత్మానందేంద్ర సరస్వతి వెల్లడించారు

ఇది కూడా చదవండి:

పుట్టినరోజు స్పెషల్: అందంగా కనిపించడానికి కోయెనా మిత్రాకు ముక్కు శస్త్రచికిత్స చేయించుకున్నారు

ప్రియాంక చోప్రా జోనాస్ తన కొత్త ప్రాజెక్ట్ గురించి ఉత్తేజకరమైన విషయం ప్రకటించింది, ఇక్కడ తెలుసుకోండి

కిమ్ కర్దాషియాన్ మరియు కాన్యే వెస్ట్ విడాకులు తీసుకుంటున్నారు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -