రాష్ట్రంలో పేదవారికి సంక్షేమ ఫలాలు అందాలన్న లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారు: మంత్రి కొడాలి నాని

కృష్ణా :ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని, ఆర్ధిక కష్టాలు ఉన్నా రాష్ట్రంలో పేదవారికి సంక్షేమ ఫలాలు అందాలన్న లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారని తెలిపారు. పుట్టగుంట గ్రామంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి  అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు చేరువ చేశారని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆగిన  11 వేల 500 మందికి వాహన మిత్ర అందించామని తెలిపారు. 

అమ్మఒడి, విద్యా దీవెన, మన బడి నాడు నేడు, జగన్న గోరు ముద్ద వంటి పధకాలుతో వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో చదువు  ఉద్యమం తీసుకువచ్చారు. 10 వేల కోట్లు  ప్రభుత్వ ఆసుపత్రులలో వసతుల కల్పనకు సీఎం కేటాయించారు. 120 కోట్లుతో గుడివాడలో జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నాం.  వైద్యానికి 1000 రూపాయల ఖర్చు పైగా అయితే దానిని ఆరోగ్యశ్రీ లోకి సీఎం తీసుకు వచ్చారు. దీని ద్వారా 2224 జబ్బులకు ఆరోగ్యశ్రీ  కింద వైద్యం  అందనుంది. కానీ ఇవేవీ గుడ్డి ఛానళ్లకి,  గుడ్డి చంద్రబాబుకి కనబడవు' అని కాడాలినాని పేర్కొన్నారు. ప్రజల మనసులు గెలిచిన వారే నాయకులవుతారని, వైఎస్‌ జగన్‌ పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. 

2023 నాటికి చంద్రునికి కార్గో డెలివరీ ని ప్రారంభించనున్న జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్

ట్రంప్ విఫలం కావడంతో ఆర్మేనియా-అజర్ బైజాన్ కాల్పుల విరమణను ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

అభివృద్ధి పై దృష్టి సారించే 4 ఎంవోయూలు కుదుర్చుకున్న భారత్, మాల్దీవులు

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -