వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో భార్య.

Jan 27 2021 01:05 PM

 

నల్గొండ: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో భార్య. అంతేగాక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించింది. ఈ క్రమంలో బంధువులు అతడి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో తమ పన్నాగం ఫలించినందుకు నిందితులు ఇద్దరు సంతోషించారు. కానీ నిందితురాలి పెద్ద కొడుకు నోరు విప్పడంతో వీరి బండారం బయపడింది. తన తండ్రిని చంపుతుండగా కళ్లారా చూసిన ఆ అబ్బాయి విషయాన్ని అందరికీ చెప్పాడు.

మునుగోడు మండలం, కొరటికల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 8న జరిగిన ఈ హత్యకేసుకు సంబంధించిన అసలు నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో మనుమడు చెప్పిన వివరాల ఆధారంగా మృతుడి తల్లిదండ్రులు కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 ఇది కూడా చదవండి:

గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియాకు సిఎం అశోక్ గెహ్లాట్ హితవు

గణతంత్ర దినోత్సవంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

Related News