ఇసుక విధానం -2019 లో సవరణ

అమరావతి :ఇసుక విధానం -2019 లో, కేబినెట్ ఆమోదంతో ప్రభుత్వం మరింత సంస్కరించబడింది. ప్రజలు తమకు నచ్చిన రీచ్‌కు వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి, అక్కడికక్కడే డబ్బు చెల్లించి, కావాల్సిన చోటుకు ఇసుక తీసుకెళ్లవచ్చు.ఎవరైనా తమకు కావలసినంత ఇసుక తీసుకొని బుక్ చేసుకోవచ్చు. దీనిపై ఎటువంటి పరిమితులు లేవు.

 ప్రజలు సొంత అవసరాలకు ఇసుకను ఎడ్లబండ్లపై ఉచితంగా తీసుకెళ్లవచ్చు. రీచ్‌లకు సమీపంలోని గ్రామాల వారికి, బలహీన వర్గాలకు ప్రభుత్వ గృహ నిర్మాణ పనులకు, సహాయ–పునరావాస కార్యక్రమం కింద నిర్మించే ఇళ్లకు కూపన్ల జారీ ద్వారా ఇసుకను ఉచితంగా ఇస్తారు. ఆన్‌లైన్‌ మోసాలకు ఆస్కారమే ఉండదు. సిఫార్సుల ఊసుండదు. ఇందుకు సంబంధించి భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది గురువారం జీఓ జారీ చేశారు.       

అన్ని దశల్లో పారదర్శకత ఉంటుంది.  అక్రమ తవ్వకాలు, నిల్వ, రవాణాను నియంత్రించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు దాడులు చేసి, కేసులు నమోదు చేసే అధికారముంటుంది. మెరుగైన ఇసుక విధానం అమలుకు భూగర్భ గనుల శాఖ సంచాలకులు, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్, ఎండీ అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.     

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు

ఆంధ్రప్రదేశ్‌ : గత 24 గంటల్లో 77,148 కరోనా నమూనాలను పరీక్షించారు.

హైకోర్టు ఉత్తర్వుల తరువాత మాజీ మంత్రి, ఎంపీ వైయస్ వివేకానంద రెడ్డి హత్యపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -