అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారీస్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన డెమొక్రాటిక్‌ పార్టీ నాయకురాలు కమలా హ్యారీస్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ట్విటర్‌ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘‘ డెమొక్రాట్లు కానీ, రిపబ్లికన్లు కానీ, రాజకీయాల సంగతి పక్కన పెడితే.. భారత మూలాలు కలిగిన కమలా హ్యారీస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు గర్వంగా ఉంది. కమలా హ్యారీస్‌కు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటంతో పాటు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

కాగా, ఒక మహిళ, ఒక ఆసియన్‌ అమెరికన్‌కు ఉపాధ్యక్ష పదవి దక్కడం ఇదే తొలిసారి. కమలా హ్యారీష్‌ ఇంతకుముందు ఎన్నో ఘనతలు సాధించారు. శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు. 

ఇది కూడా చదవండి :

భారతదేశంలో తగ్గిన కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో 45674 కొత్త కేసులు కనుగొనబడ్డాయి

ప్రీ వెడ్డింగ్ ఆతురత నుంచి బయటపడటానికి 4 సులభ చిట్కాలు

'దగ్గరగా పని చేయడానికి చూడండి' : అమెరికా కొత్త అధ్యక్షుడు బిడెన్, ఉపాధ్యక్షుడు హ్యారిస్ లను ప్రధాని మోడీ అభినందించారు.

- Sponsored Advert -

Most Popular

- Sponsored Advert -