అమరావతి: పథకం కింద 51,390 మంది టైలర్లు, రాజక్, నయబ్రహ్మణులకు బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ మంగళవారం రూ .51.39 కోట్లు ఆర్థిక సహాయం చేశారు. విజయవాడలో 'జగనన్న చేదోడు' సాయాన్ని మంత్రి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ‘అర్హత ఉన్న ఏ ఒక్కరూ సాయం పొందకుండా ఉండకూడదన్న ఆలోచనతో నెల రోజులపాటు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిచ్చి లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. బీసీలకు జగన్ ఇచ్చిన దీపావళి కానుక ఇది’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ యానాదయ్య పాల్గొన్నారు.
వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ సాయమందించేందుకు మళ్లీ నెల రోజులు అవకాశమిచ్చిందన్నారు. దీనివల్ల మరో 51,390 మందికి లబ్ధి జరిగిందన్నారు. ఇంత పారదర్శకంగా ఏ ప్రభుత్వమైనా చేసిందా? అని మంత్రి ప్రశ్నించారు. తాజాగా సాయం అందుకున్న వారిలో టైలర్లు 24,336 మంది, నాయీబ్రాహ్మణులు 6,317 మంది, రజకులు 20,737 మంది ఉన్నారని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 1,48,168 మంది రజకులు, నాయీబ్రాహ్మణులకు 148.16 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. కానీ తమ ప్రభుత్వం టైలర్లను కూడా కలిపి కేవలం ఏడాదిలోనే ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున 2,98,430 మందికి రూ.298.43 కోట్లు అందించిందన్నారు.
పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు
పోలీసుల వేధింపులతో విసిగిపోయిన కుటుంబం కదులుతున్న రైలు ముందుకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు